బాబీ కి డెడ్ లైన్ పెట్టిన ఎన్టీఆర్ !

  • June 6, 2017 / 06:48 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్…టాలీవుడ్ లో నవరసాల నటుడుగా పేరు తెచ్చుకున్న అతి కొద్ది మంది హీరోల్లో మన యంగ్ టైగర్ ఒకరు. ఏ పాత్రలో అయినా ఒదిగిపోయి మరీ ఆ పాత్రకు ప్రాణం పొయ్యగల టాలెంట్ ఎన్టీఆర్ కి ఉంది. అయితే వరుస పరాజయాలతో డీలా పడ్డ ఎన్టీఆర్ టెంపర్ సినిమాతో మళ్లీ హిట్ ట్ర్యాక్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అదే క్రమంలో ఆ హిట్ ట్ర్యాక్ ను కొనసాగిస్తూ హ్యాట్రిక్ హిట్ కొట్టి తన రేంజ్ ను మరోసారి టాలీవుడ్ కు రుచు చూపించాడు. ఇక ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ లాంటి భారీ బ్లాక్ బష్టర్ తరువాత త్రిపాత్రాభినయమ్ చేస్తున్నా ఎన్టీఆర్ తన సినిమా రిలీజ్ పై కొంచెం తొందర పడుతున్నాడు అని తెలుస్తుంది. విషయంలోకి వెళితే, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న జైలవకుశ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అదే క్రమంలో సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యేలా చేసింది. ఇక ఈ సినిమాపై పరిశ్రమలో కూడా అంచనాలు ఉన్న క్రమంలో….ఎన్టీఆర్ కాస్త తొందర పడాలి అని ఆలోచిస్తున్నాడు.

జనతా గ్యారేజ్ తర్వాత తారక్ చేస్తున్న ఈ మూవీ జనతా సెంటిమెంట్ ను ఫాలో అవ్వాలని ప్లాన్ చేస్తున్నడట. అదేలా అంటే జనతా గ్యారేజ్ రిలీజ్ నాడు అంటే సెప్టెంబర్ 1న సినిమా రిలీజ్ చేసేలా బాబిని షెడ్యూల్ ప్లాన్ చేయమంటున్నాడట. ఎట్టిపరిస్థితుల్లో సెప్టెంబర్ 1కల్లా జై లవకుశ సినిమా చేయాలని బాబిపై ఫోర్స్ చేస్తున్నాడట తారక్. మరి అనుకున్న డేట్ కు రిలీజ్ అవ్వాలనే ఉద్దేశంతో బాబిని తొందరపెడితే సినిమా ఔట్పుట్ పాడైపోయే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి…అని చెప్పవచ్చు. ఇక ఫస్ట్ లుక్ లో జై లుక్ లో అదరగొట్టిన తారక్ సినిమాలో మిగిలిన పాత్రలతో కూడా సర్ ప్రైజ్ చేస్తాడని అంటున్నారు. చూడాలి మరి దసరా బరిలో దిగి హిట్ కొడతాడో, లేక సెంటిమెంట్ కోసం ముందుగా వస్తాడో.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus