గౌతమి పుత్ర శాతకర్ణి ఆడియో వేదికపై నందమూరి హీరోల కలయిక

  • December 20, 2016 / 10:27 AM IST

నందమూరి హీరోలందరిదీ ఒక దారి అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ది మరో దారి అని మొన్నటి వరకు చెప్పుకునే వారు. కానీ నటసింహ బాలకృష్ణ వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి  ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు తారక్ ట్వీట్ చేయడంతో అన్ని రూమర్లు తోక ముడిచాయి. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తోనే కాకుండా బాబాయ్ తోను కలిసిమెలిసి ఉన్నట్లు ఆ పోస్ట్ చెప్పకనే చెప్పింది. ఇప్పుడు వీరి గురించి ఆసక్తికర సంగతి బయటికి వచ్చింది.

ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై  క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన  `గౌతమిపుత్ర శాతకర్ణి` ఆడియో వేడుకను తిరుప‌తిలోని శ్రీ పండిట్ జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రు మున్సిప‌ల్ హై స్కూల్‌ గ్రౌండ్ లో డిసెంబ‌ర్ 26న గ్రాండ్‌గా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ వేడుకకు హరికృష్ణ, కళ్యాణ్ రామ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరు కానున్నట్లు తెలిసింది. దీంతో ఈ వేదికపై నందమూరి హీరోలందరినీ ఒకే సారి చూసే అవకాశం అభిమానులకి దక్కనుంది. కళ్యాణ్ రామ్ ఇజం సినిమా వేడుకలో తన మాటలతో అదరగొట్టిన తారక్,  గౌతమి పుత్ర శాతకర్ణి ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ఏ విధంగా మాట్లాడుతారోనని అందరూ ఆసక్తిగా ఉన్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus