చరణ్ మాస్ హైప్ ముందు ఢీలాపడ్డ ఎన్టీఆర్ క్లాస్ మేనియా

  • January 5, 2019 / 01:50 PM IST

ప్రతి శుక్రవారం సినిమాల సందడి ఎంత కామనో.. కొన్ని సందర్భాల్లో స్టార్ హీరోల నడుమ పోటీ తలెత్తడం అనేది కూడా సర్వసాధారణం. కానీ.. ప్రతి ఏడాది సంక్రాంతి, దసరా పండుగలప్పుడు మాత్రం స్టార్ హీరోల మధ్య వార్ కంపల్సరీ అవుతుంటుంది. ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా స్టార్ హీరోలందరూ ఒకరి తర్వాత ఒకరు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. బాలయ్య నటించిన “ఎన్టీఆర్ కథానాయకుడు”, రామ్ చరణ్ నటించిన “వినయ విధేయ రామ”, వెంకీ-వరుణ్ లు నటించిన “ఎఫ్ 2” సినిమాలతోపాటు రజనీకాంత్ నటించిన “పెట్ట” అనువాదరూపంలో అదే రోజున విడుదలకు సిద్ధపడుతోంది.

అయితే.. ప్రధాన పోటీ మాత్రం రామ్ చరణ్, బాలకృష్ణల నడుమ జరగనుంది. ఇద్దరి నడుమ దాదాపుగా ఓ ప్రచ్చన్న యుద్ధమే జరగనుండగా.. మొన్నటివరకూ ప్రేక్షకుల చూపు మొత్తం ఎన్టీఆర్ బయోపిక్ మీదే ఉండగా.. ఇప్పుడు రామ్ చరణ్ తన సరికొత్త మాస్ లుక్ తో వారి దృష్టిని వినయ విధేయ రామ వైపు మళ్లిస్తున్నాడు. మామూలుగానే మాస్ సినిమాలంటే విపరీతమైన ఆసక్తి చూపించే తెలుగు ప్రేక్షకులు వినయ విధేయ రామపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా.. రామ్ చరణ్ & వివేక్ ఒబెరాయ్ కొత్త పోస్టర్స్ ప్రేక్షకులకి సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేశాయి. ఆ కారణంగా మొన్నటివరకూ ఎన్టీఆర్ బయోపిక్ మీద ఉన్న ప్రేక్షకుల దృష్టి ఇప్పుడు వినయ విధేయ రామపై పడింది. మరి ఈ ఇద్దరిలో ఎవరు విజయం సాధిస్తారు అనేది జనవరి 12కి తెలియనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus