‘ఎన్టీఆర్ -మహానాయకుడు’ ప్రమోషన్స్ విషయంలో బాలయ్య డెసిషన్ అదే..!

  • January 29, 2019 / 12:02 PM IST

‘ఎన్టీఆర్‌ బయోపిక్’ నుండీ తొలిభాగమైన ‘ఎన్టీఆర్ – క‌థానాయ‌కుడు’ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నందమూరి బాలకృష్ణ సొంత బ్యానర్ అయిన ‘ఎన్.బి.కె ఫిలిమ్స్’ సంస్థ నుండీ వచ్చిన మొదటి చిత్రం కావడంతో… ఈ చిత్రానికి ప్ర‌మోష‌న్లు ఓ రేంజులో నిర్వ‌హించారు. ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాల‌న్‌ని కూడా తీసుకొచ్చి ఇంట‌ర్వ్యూలు నిర్వహించారు. రానా, కళ్యాణ్ రామ్, క్రిష్‌, సుమంత్‌, కీర‌వాణి… ఇలా అంద‌రూ ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొన్నారు ఇప్పుడు రెండో భాగమైన ‘ఎన్టీఆర్ – మ‌హా నాయ‌కుడు’ చిత్రం కూడా విడుద‌ల‌కు సిద్దమవుతుంది.

అయితే ఈసారీ… ఈ రేంజ్ లో ప్రమోషన్లు చేసే అవకాశాలు క‌నిపించ‌డం లేదనే చెప్పాలి. అస‌లు ప్రమోషన్లు నిర్వహిస్తారా అనే అనుమానాలు కూడా ఏర్పడుతున్నాయి. దీనికి ముఖ్య కారణం ఈ చిత్ర విడుదలకు చాలా తక్కువ సమయం ఉండడం.. అందులోనూ…, ‘కథానాయకుడు’ చిత్ర సమయంలోనే ఈ చిత్రం గురించి మాట్లాడాల్సింది.. మాట్లాడేశారు. ఇక ట్రైలర్, పాట‌లు కూడా ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ టైములో చేసేసారు. అయితే మరో ట్రైల‌ర్ విడుదల చేసే అవకాశం ఉంది. అది త‌ప్ప‌.. కొత్త‌గా చెప్ప‌డానికీ, చూపించ‌డానికీ ఏమీ మిగలలేదనే చెప్పాలి. అయితే ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ చిత్రం డిజాస్టర్ అయ్యింది కాబట్టి.. ఆ చిత్రం వలన నష్టపోయిన బయ్యర్ల గురించి అయినా ప్రమోషన్లు చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం .. ట్రైల‌ర్ లాంచ్‌తో ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌ను స‌రిపెట్టాల‌ని బాల‌య్య భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇక ఎలక్ట్రానిక్,ప్రింట్ మీడియాలకు ఇచ్చే ఇంట‌ర్వ్యూల‌తో ఈ ప్రమోషన్లకు పుల్ స్టాప్‌ బాలయ్య – క్రిష్ లు భావిస్తున్నట్టు ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియాల్సి ఉంది..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus