ఎన్టీఆర్ మాటతో టెన్షన్ పడుతున్న బాబీ

  • June 30, 2017 / 06:01 AM IST

బాబీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘జైలవకుశ’ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. మొన్నటి వరకు రామోజీ ఫిలిం సిటీలోని భారీ సెట్ లో కీలక సీన్లకు తెరకెక్కించారు. ఇప్పుడు హైదరాబాద్ శివార్లలో ఉన్న ఓ క్వారీలో యాక్షన్ సన్నివేశాల్ని షూట్ చేస్తున్నారు. విలన్ పాత్రధారి రోనిత్ రాయ్, ఎన్టీఆర్ కాంబినేషన్ సీన్స్ ఈ  నెలాఖరులోపున కంప్లీట్ చేయాలనీ అనుకున్నారు. కానీ పూర్తి కాలేదని తెలిసింది. దాంతో ఎన్టీఆర్ కాస్తంత అసహనాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమా షూటింగును పూర్తి చేయమని, సెప్టెంబర్ 21న  ప్రేక్షకుల ముందుకు వెళ్లవలసిందేననీ .. దసరా సెలవులను ఎలాంటి పరిస్థితుల్లోను మిస్ కావొద్దని అన్నాడట.

దాంతో ఆ సమయానికి అన్ని పనులు పూర్తి చేసే విషయంలో బాబీ టెన్షన్ పడుతున్నాడని తెలిసింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తారక్ సరసన రాశీఖన్నా, నివేదా థామస్, నందితా రాజ్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus