తారక్ తో మూవీ ఆలస్యానికి కారణం వంశీనే : కళ్యాణ్ రామ్

  • October 25, 2016 / 12:58 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తర్వాత రచయిత వక్కంతు వంశీని డైరక్టర్ గా సినీ పరిశ్రమకు పరిచయం చేయాలనీ భావించారు. అందుకు నిర్మాత కళ్యాణ్ రామ్ కూడా ఒకే చెప్పారు. ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో తారక్, వంశీ కాంబినేషన్లో మూవీ ప్రకటన వెలువడుతుందని అందరూ అనుకున్నారు. కానీ చివరి నిముషంలో కథ అడ్డం తిరిగింది. వంశీ కథను ఎన్టీఆర్ హోల్డ్ లో పెట్టారనే ప్రచారం సాగింది. అసలు ఏమి జరిగింది అనే దానిపై నిర్మాత కళ్యాణ్ రామ్ రీసెంట్ గా వివరణ ఇచ్చారు. “తారక్ కి వంశీ చెప్పిన కథ బాగా నచ్చింది. నాక్కూడా నచ్చింది.

కానీ అందులో కొన్ని సీన్లు బాగాలేవని, మళ్లీ కొత్తగా రాసుకురమ్మని ఎన్టీఆర్ చెప్పాడు. ఇది జరిగింది ఏప్రిల్ నెలలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు వంశీ అడ్రస్ లేరు” అని నిర్మాత వెల్లడించారు. తారక్ ల్లాంటి హీరో తో సినిమా అంటే అనేక చర్చలు జరుగుతాయని, అందుకు డైరక్టర్ చురుక్కా ఉండాలని చెప్పారు. ఐదు నెలలైనా మార్పులతో కథను తీసుకురాకపోవడం వంశీ తప్పేనని వివరించారు. అందుకే ఎన్టీఆర్, వంశీ కాంబినేషన్ సెట్స్ మీదకు వెళ్లలేదని స్పష్టం చేశారు. అదన్నమాట అసలు కథ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus