మూడోసారి బయటికి వచ్చిన ఎన్టీఆర్ మూవీ షూటింగ్ ఫోటోలు

Advertisement

అరవింద సమేత వీర రాఘవ షూటింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం చిత్ర బృందానికి తలనొప్పిగా మారింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ లీకులు ఆగడం లేదు. చిత్ర యూనిట్ సభ్యులు స్పాట్ లోకి ఫోన్లు తీసుకురావద్దని త్రివిక్రమ్ గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా లీకుల గోల ఆగడం లేదు. మొన్న రైల్వే స్టేషన్ లో పూజా హెగ్డే, ఎన్టీఆర్ లపై ఓ సన్నివేశం తెరకెక్కిస్తుండగా.. ఆ చిత్రికరణను ఎవరో ఫోటోలు తీసి నెట్లో పెట్టారు. చిత్ర యూనిట్ ని కంట్రోల్ చేయగలిగారు కానీ.. అభిమానులను కంట్రోల్ చేయలేకపోయారు. ఈరోజు కూడా అదే రిపీట్ అయింది.

ఈ ఫొటోలో ఎన్టీఆర్ జీప్ డ్రైవింగ్ సీట్ లో కూర్చొని తలవంచి పక్కకు చూస్తున్నాడు. సీరియస్ గానే అయిన కాస్తా దిగాలుగా ఉన్నట్టు అనిపిస్తోంది. పోలీస్ బెటాలియన్ ఎన్టీఆర్ జీపు వెనక ముందు గ్రీన్ టోపీలు పెట్టుకుని ఉన్నారు. వాళ్లతో పాటు జనాలు కూడా చుట్టూ మూగి ఉన్నారు. ఈ ఫోటో మాత్రం సినిమాలో ఒక హై ఎమోషన్ ఉన్న సీన్ లోనిది అని మాత్రం అర్థం అవుతోంది. అయితే ఈ ఫోటో అభిమానుల్లో సినిమాపై ఆత్రుతని పెంచింది. ఈ మూవీ టాకీ పార్ట్ ని సెప్టెంబర్ 20 లోపు కంప్లీట్ చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారు. ఆ తర్వాత పాటల చిత్రీకరణ పూర్తిచేస్తారు. హారిక, హాసిని బ్యానర్లో రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా ఎలాగైనా అక్టోబర్ 11 న థియేటర్లోకి తీసుకురావాలని ప్రతి ఒక్కరూ విశ్రాంతి తీసుకోకుండా శ్రమిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus