పూరి జగన్నాథ్ తో సినిమా చేసేందుకు తారక్ కొత్త రూల్

  • October 19, 2016 / 06:49 AM IST

‘జనతా గ్యారేజ్’ టాలీవుడ్ రికార్డులన్నింటికీ రిపేరు చేయడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పూర్వవైభవం సొంతం చేసుకున్నారు. హ్యాట్రిక్ హిట్ తో ఫుల్ ఫామ్లోకి వచ్చారు. ఇదే జోరు కొనసాగాలని కొంచెం ఆలస్యమైనా మంచి కథను ఎంచుకోవాలని ఎదురుచూస్తున్నారు. తారక్ కి అనిల్ రావిపూడి, పూరి జగన్నాథ్ , లింగు స్వామి, ఒక్కంతు వంశీ తదితరులు కథలు చెప్పారు. వీటిలో అన్ని కథలు నచ్చాయి. కానీ తనకి టెంపర్ వంటి హిట్ ఇచ్చిన  పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే నటించేందుకు ఆయన ఆసక్తి చూపిస్తున్నారు.

అయినా ఆ స్పీడ్ డైరక్టర్ కి కూడా ఎన్టీఆర్ వెంటనే ఓకే చెప్పలేదని సమాచారం. ఇప్పుడు అతను కళ్యాణ్ రామ్ హీరో తెరకెక్కించిన “ఇజం” చిత్రానికి వచ్చే రెస్పాన్స్ బట్టి  సినిమా, చేయాలో వద్దో డిసైడ్ చేస్తారంట. ఈ విషయాన్నీ తారక్, పూరి జగన్నాథ్ కి కొన్ని రోజుల క్రితమే చెప్పినట్లు తెలిసింది. ఇజం హిట్ పైనే పూరి, తారక్ కాంబినేషన్లో సినిమా ఆధారపడి ఉంది. ఇజం సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని, ఈనెల చివరి వారంలో ఎన్టీఆర్ కొత్త చిత్రం ప్రకటన ఉంటుందని పూరి జగన్నాథ్ సన్నిహితులు వెల్లడించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus