తారక్ తర్వాతి సినిమాకు అంతా ఫిక్స్

  • October 19, 2016 / 10:39 AM IST

జనతా గ్యారేజ్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేసే సినిమా ఖరారు అయింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించనున్న మూవీకి డైరక్టర్ గా పూరి జగన్నాథ్ ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాకు పూర్తిగా టెంపర్ కు పని చేసిన టెక్నీషియన్లు, ఆర్టిస్టులను తీసుకోవడం జరిగి పోయింది. ప్రధాన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని డిసైడ్ చేశారు. “మా తాత టెంపర్…”, “దేవుడా.. దేవుడా”  అంటూ మాస్ బీట్ తో పాటలను ఇచ్చిన అనూప్ రూబెన్స్ నే ఇందుకు సంగీత దర్శకునిగా ఎంచుకున్నారు.

ఇందులో కొత్తగా నేను శైలజ బ్యూటీ కీర్తి సురేష్ యాడ్ అవుతోంది. టెంపర్ సినిమాకు వక్కంతు వంశీ కథ అందించగా, ఈ సారి పూరి కథతోనే ఎన్టీఆర్ నటించనున్నారు. ఈ కథలో తారక్ బాక్సర్ గా కనిపించనున్నట్లు సమాచారం. అందుకే ఈ సినిమాకు బాక్సర్ పేరుని కళ్యాణ్ రామ్ రిజిస్టర్ చేయించినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు వెల్లడించాయి. అక్టోబర్ 21 న కళ్యాణ్ రామ్, పూరి కాంబినేషన్లో తెరకెక్కిన ఇజం రిలీజ్ కానుంది. నెక్స్ట్ రోజు… అంటే శనివారం  ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus