“నా నువ్వే” ఆడియో వేడుకకు తారక్ హాజరు కాకపోవడానికి కారణం ఇదే

  • May 8, 2018 / 09:47 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొంతకాలంగా ప్రతి ఒక్కరితోను స్నేహాన్ని పెంచుకుంటున్నారు. మొదట కుటుంబ సభ్యులకు దగ్గరైన తారక్, ఆ తర్వాత ఈగోలను పక్కన పెట్టి తెలుగు హీరోల వేడుకలకు హాజరై ఇతర హీరోల అభిమానులు సైతం తనని అభిమానించేలా చేసుకుంటున్నారు. ఇంతచేస్తున్నా ఎన్టీఆర్ పై రూమర్లు ఆగడం లేదు. ఎంతో కలిసి మెలిసి ఉన్న నందమూరి సోదరులు (ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ) విడిపోయారని కొన్ని రోజుల క్రితం చక్కర్లు కొట్టింది. కల్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కిన ఎమ్మెల్యే ఆడియో ఫంక్షన్‌కు ఎన్టీఆర్ హాజరు కాకపోవడమే ఈ రూమర్ కి బలాన్నిచ్చింది. దీంతో ఇది అబద్ధపు వార్తని చెప్పడానికి కల్యాణ్‌ రామ్‌ కొత్త సినిమా ఓపెనింగ్‌ కే ఎన్టీఆర్ వెళ్లాల్సి వచ్చింది.

దీంతో నెగటివ్ వార్తలు బంద్ అయ్యాయి. తాజాగా కల్యాణ్ రామ్‌ హీరోగా తెరకెక్కిన నా నువ్వే సినిమా ఆడియో వేడుకకు కూడా ఎన్టీఆర్‌ హాజరు కాలేదు. దీంతో మరోసారి రూమర్లు షికారు చేస్తాయని ఆలోచించిన ఎన్టీఆర్‌ టీమ్ సభ్యులు వెంటనే క్లారిటీ ఇచ్చారు. వైజాగ్‌లో హరికృష్ణ బంధువుల పెళ్లి వేడుకకు హాజరు కావాల్సి ఉండటంతో ఎన్టీఆర్‌ ‘నా నువ్వే’ ఆడియో వేడుకకు హాజరు కాలేకపోయారని స్పష్టం చేశారు. జై లవకుశ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు. హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ త్వరలో రామోజీ ఫిలిం సిటీ లో మొదలుకానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus