ఎన్టీఆర్, త్రివిక్రమ్ మధ్య గొడవకు కారణం ఏమిటంటే ?

  • June 23, 2018 / 09:57 AM IST

త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే తెలుగు హీరోల అందరికీ అభిమానం. చాలామంది గురూజీ అని పిలుస్తుంటారు. ఎన్టీఆర్ కూడా అదే విధంగా గౌరవిస్తుంటారు. అతని దర్శకత్వంలో నటించాలని ఎప్పటి నుంచో అనుకున్నప్పటికీ ఇప్పటికి కుదిరింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ సినిమా చేస్తున్నసంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం డైరక్టర్ చెప్పినట్టుగానే తారక్ కష్టపడి సిక్స్ ప్యాక్ రప్పించారు. సినిమా షూటింగ్ కూడా సజావుగానే సాగుతోంది. అయితే ఎన్టీఆర్, త్రివిక్రమ్ మధ్య చిన్న గొడవ వచ్చిందని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. అందుకు కారణం ఏమిటని ఆరా తీస్తే అసలు విషయం బయట పడింది. త్రివిక్రమ్ కి జానపద గేయాలు అంటే చాలా ఇష్టం. అందుకే తన సినిమాల్లో అలనాటి పాటలు కనిపిస్తుంటాయి. ఇందులో కూడా త్రివిక్రమ్ ఒక జానపద పాట కావాలని మ్యూజిక్ డైరక్టర్ థమన్ తో చెప్పారంట. అతను కూడా మంచి బీట్ తో పాటని కంపోజ్ చేసేసారు.

‘కృష్ణార్జున యుద్ధం’ లో ‘దారి చూడు’ పాటను పాడిన పెంచల్ దాస్ తో ఈపాటను చిత్తూరు యాసలో పాడించాలని, ఈపాటకు సంబంధించిన రికార్డింగ్ రిహార్సల్స్ కూడ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలుసుకున్న జూనియర్ తన పై జానపద పాట ప్రయోగం వద్దని ఒక పక్కా మాస్ సాంగ్ ను పెట్టమని సూచన ఇచ్చినట్లు సమాచారం. ఇది త్రివిక్రమ్ ని బాధకి గురిచేసిందని, తన మాటకి విలువలేకపోయిందని ఆవేదనతో ఉన్నారని అతని సన్నిహితులు చెప్పారు. అజ్ఞాతవాసి ఫెయిల్ కావడంతో త్రివిక్రమ్ ఎన్టీఆర్ మాటకి ఎదురుచెప్పలేకపోతున్నారని టాక్. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో.. వాళ్లిద్దరూ నోరు విప్పితేగానే క్లారిటీ రాదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus