ఈ గొడవలు నాకొద్దు బాబోయ్..!

  • March 20, 2019 / 11:19 AM IST

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావిడి ఓ రేంజ్లో మొదలయ్యింది. సరిగ్గా పదేళ్ళ క్రితం మెగాస్టార్ చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీ స్థాపించినప్పుడు ఏ విధంగా హడావిడి ఉందో ఇప్పుడు కూడా అదేతరహా హడావిడి ఉంది. ఎందుకంటే ఈ సరి పవన్ కళ్యాణ్ స్థాపించిన ‘జనసేన’ పార్టీ కూడా పోటీ చేస్తుంది. ఇక అప్పుటి లాగే ఇప్పుడు కూడా సినీ గ్లామర్ సందడి చేయబోతుంది. ఇదిలా ఉండగా.. మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ డైరెక్ట్ గా ప్రచారం చేయకపోయినా… మహేష్ అక్క జయదేవ్ భార్య పద్మావతి ప్రచారం చేస్తున్న గుంటూరు పరిసర ప్రాంతాలలో ప్రతి ఇంటికి తిరుగుతుండగా అంతర్లీనంగా మహేష్ మ్యానియా కూడా పనిచేస్తున్నట్టు స్పష్టం అవుతుంది.ఇందులో భాగంగా మహేష్ ‘మహర్షి’ చిత్ర ఫోటోలను, బ్యానర్లను అక్కడ మహిళా సభ్యులు ప్రచారంలో పెట్టి తిరగడం.. తన బావ కోసం మహేష్ ప్రచారం చేస్తున్నట్టే కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే… ఇటీవల నార్నె శ్రీనివాసరావు వై.సి.పి లో జాయినయిన సంగతి తెలిసిందే. అయితే తన ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ ను ఓ వీడియో రూపంలో తన అభినానులకి సందేశం ఇవ్వమని. తద్వారా తనకి ప్రచారం జరుగుతుందని శ్రీనివాసరావు… ఎన్టీఆర్ ను కోరారట. అయితే దీనిని జూ.ఎన్టీఆర్ తిరస్కరించాడని సమాచారం. అంతే కాదు తన ప్రచారంలో తన ఫోటోలను, బ్యానర్లను ఎక్కడా వాడొద్దని తన మామకి గట్టిగా చెప్పాడట తారక్. పదేళ్ళ తరువాత తాను రాజకీయాల్లోకి వచ్చి.. పోటీ చేసినా… చేయకపోయినా తన పూర్తిగా తెలుగుదేశం పార్టీకోసమే పనిచేస్తానని చెప్పాడట. సో దీని ప్రకారం చూస్తే ఎన్టీఆర్… ఈ ఎన్నికల్లో తారక్ సందడి లేనట్టే కనిపిస్తుంది. పదేళ్ళ క్రితం తెలుగు దేశం పార్టీ కోసం ఓ రేంజ్లో ప్రచారం చేసిన తారక్ ఈసారి మాత్రం అటు వైపు కన్నెత్తి కూడా చూడట్లేదని తెలుస్తుంది. అందులోనూ బాలయ్య, చంద్ర బాబు లతో ఎన్టీఆర్ కి మనస్పర్థలు ఉండటం.. మరో పక్క తన మామ ఇలా ప్రతార్థి పార్టీలో జాయినవ్వడంతో… లేని పోని వివాదాలు నాకెందుకులే అనుకుంటున్నాడేమో. ఇలా మహేష్ స్ట్రాటజీ ని ఎన్టీఆర్ ద్వారా ఉపయోగించుకుందామనుకున్న ఎన్టీఆర్ మామగారి ప్లాన్ రిజెక్ట్ అయ్యిందన్న మాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus