మాస్ డైరక్టర్ ని రహస్యంగా కలుస్తున్న తారక్
- November 21, 2016 / 11:04 AM ISTByFilmy Focus
మాస్ డైరక్టర్ వి.వి.వినాయక్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం. ఎందుకంటే డైరక్టర్ గా అవకాశమిచ్చారు కాబట్టి. తారక్ కి వినాయక్ అంటే ఇష్టమే. లేత వయసులోనే ఆది లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను ఇచ్చినందుకు. ఆ సినిమా నుంచి వీరి మధ్య స్నేహం బలపడింది. ఆ తర్వాత వచ్చిన సాంబ ఓ మోస్తరుగా ఆడినా, వీరి కాంబినేషన్లో వచ్చిన అదుర్స్ సూపర్ హిట్ అయింది. అప్పటి నుంచి ఎన్టీఆర్ వినాయక్ తో సినిమా చేయడానికి వీలు పడడం లేదు. ఈ సారి ఎలాగైనా మాస్ డైరక్టర్ డైరక్షన్లో నటించాలని తారక్ ప్లాన్ చేస్తున్నారు.
అందుకే ఓ వైపు రచయితలు, దర్శకులు చెబుతున్న కథలను వింటూనే వీలున్నప్పుడల్లా వినాయక్ ని ఎన్టీఆర్ కలుస్తున్నారు. అదుర్స్ 2 చేద్దామా?, లేకుంటే దానవీర సూర కర్ణ చిత్రాన్ని రీమేక్ చేద్దామా? అని చర్చిస్తున్నారు. ఈ మీటింగ్ లో ఎన్టీఆర్, వినాయక్, అతని అసిస్టెంట్స్ మాత్రమే పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ రెండింటిలో ఒక దాన్ని సెలక్ట్ చేస్తారా? లేక కొత్త కథతో వస్తారా? అనేది ఇంకా ఖరారు కాలేదు. అయితే వీరి కాంబినేషన్లో సినిమా రావడం పక్కా అని ఫిల్మ్ నగర్ వాసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఖైదీ నంబర్ 150 చిత్రాన్ని తెరకెక్కిస్తున్న వినాయక్ త్వరలో ఈ మూవీని కంప్లీట్ చేసి ఎన్టీఆర్ సినిమా పనుల్లో నిమగ్నం కానున్నట్లు వెల్లడించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















