అభిమానులు ఆశ్చర్యపోయేలా మారిపోనున్న ఎన్టీఆర్

  • December 27, 2017 / 07:09 AM IST

సినీ స్టార్స్ కష్టం అంతా అభిమానులను ఆనందింపజేయడం కోసమే. అందుకోసం ఏ రిస్క్ తీసుకోవడానికైనా వెనుకాడరు. చిన్న వయసులోనే అత్యధికమంది ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ప్రతి సినిమాలోనూ కొత్తగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సారి కూడా అదే మంత్రాన్ని ఫాలో అవుతున్నారు. జై లవకుశ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగంల్ ఇచ్చారు. పూజా కార్యక్రమాలు కూడా జరుపుకొని రెగ్యులర్ షూటింగ్ కి చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి రిలీజ్ అయిన వెంటనే త్రివిక్రమ్ ఈ చిత్రం పై దృష్టిపెట్టనున్నారు. అయితే అప్పటిలోపున ఎన్టీఆర్ టార్గెట్ పెట్టుకున్నారు.

బరువు తగ్గడానికి డైట్ ప్రారంభించేసారు. 18 కిలోల బరువు తగ్గాలని ఫిక్స్ అయ్యారు. గతంలో యమదొంగ, కంత్రి మూవీ సమయంలో పాతిక కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు కూడా అలాగే బరువు తగ్గి ఆశ్చర్య పరచాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ముంబయి న్యూట్రిషన్ తో సలహాలు తీసుకొని, నిపుణులు చెప్పినట్లుగా డైట్ ఫాలో అవుతున్నారు. అంతేకాదు చాలా గ్లామర్ గా కనిపించడానికి విదేశీ స్టైలిష్ ని నియమించినట్లు సమాచారం. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మించనున్నఎన్టీఆర్ 28 వ సినిమా ఫిబ్రవరి లో సెట్స్ మీదకు వెళ్లనుంది. తొలిసారి త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus