కళ్యాణ్ రామ్ సినిమాలో గెస్ట్ అప్పీల్ పై క్లారిటీ ఇచ్చిన తారక్

  • September 24, 2016 / 12:30 PM IST

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ హీరో గా నటిస్తూ నిర్మిస్తున్న యాక్షన్ చిత్రం “ఇజం”. స్పీడ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరక్కుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్ట్ రోల్ చేస్తున్నారంటూ గతంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అందులో నిజం లేదని తేలింది. తారక్ ని స్పెషల్ అప్పీరియన్స్ ఇవ్వమని కళ్యాణ్ రామ్ అడిగిన మాట వాస్తవమే కానీ.. అన్న మాటను సున్నితంగా ఎన్టీఆర్ తిరస్కరించారని తెలిసింది. అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అంగీకరించారని సమాచారం.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం  త్వరలోనే తారక్ వాయిస్ ఓవర్ ను రికార్డ్ చేయనున్నారు. జర్నలిస్ట్‌గా ఒక పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌లో కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఈ చిత్రంలో అదితి ఆర్య హీరోయిన్ గా నటిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్న ఈ మూవీలో జగపతి బాబు కీలక రోల్ పోషించారు. రీసెంట్ గా విడుద లయిన ఇజం టీజర్ యూట్యూబ్ లో రికార్డ్ సృష్టించింది. ఈ వీడియోను అత్యధిక మంది చూసారు. ఎక్కువభాగం స్పెయిన్ లో షూటింగ్ జరుపుకున్న ఈ ఫిల్మ్ వచ్చే నెల రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus