మూడు కథలకు ఒకే చెప్పిన ఎన్టీఆర్

  • January 4, 2017 / 01:32 PM IST

జనతా గ్యారేజ్ సినిమా తర్వాత కథను సెలక్ట్ చేయడానికి మూడు నెలలు సమయం తీసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ తర్వాత చేయనున్న మూవీల కోసం టైమ్ వృధా చేయడంలేదు. ఇప్పుడే వరుసగా 27 , 28 , 29 చిత్రాలకు కథలను, డైరెక్టర్లను ఒకే చేశారు. పవర్, సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాలను డైరక్ట్ చేసిన బాబీ ఎన్టీఆర్ 27 వ మూవీ చేయనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో రూపుదిద్దుకోనున్న ఈ ఫిల్మ్ ని జనవరి 26 వ తేదీ నుంచి పట్టాలెక్కించడానికి నిర్మాత కళ్యాణ్ రామ్ సిద్ధమయ్యారు. ఇందులో తారక్ మూడు పాత్రలో మెరవనున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కోసం అందమైన కుటుంబ కథా చిత్రాన్ని రెడీ చేశారు. ఈ కథ కు తారక్ ఒకే చెప్పడం.. నిర్మాత సెట్ కావడం జరిగిపోయింది. సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీని హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించనున్నారు.

మనం, ‘24’ హిట్లతో దూసుకుపోతోన్న విక్రమ్ కుమార్ డైరక్షన్లో ఎన్టీఆర్ 29 వ మూవీ చేయనున్నారు. ప్రస్తుతం అక్కినేని అఖిల్ తో ప్రాజక్ట్ చేస్తున్న ఈ డైరక్టర్ చెప్పిన లైన్ నచ్చడంతో తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఇది వచ్చే ఏడాది ఏప్రిల్లో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఇలా వచ్చే ఏడాది చివరి వరకు ఎన్టీఆర్ తన డైరీలో డేట్స్ మొత్తం లాక్ చేసుకున్నారు. బాబీతో యాక్షన్ థ్రిల్లర్, త్రివిక్రమ్ తో ఫ్యామిలీ డ్రామా, విక్రమ్ కుమార్ తో యాక్షన్ కథలను ఎంచుకొని అభిమానులను అలరించడానికి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వచ్చేస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus