జూన్ కి వాయిదాపడిన “ఒక్క అమ్మాయి తప్ప” విడుదల!

  • May 25, 2016 / 02:47 PM IST

సందీప్ కిషన్-నిత్యామీనన్ జంటగా రాజసింహ తెరకెక్కిస్తున్న చిత్రం “ఒక్క అమ్మాయి తప్ప”. సస్పెన్స్ అండ్ లవ్ త్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తొలుత మే 27న విడుదల చేద్దామని నిర్మాత బోగాది అంజిరెడ్డి భావించారు.

మరి ఏమయ్యిందో తెలియదు కానీ.. ఈ సినిమాకి జూన్ నెలకు పోస్ట్ పోన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అసలే వరుస ఫ్లాపులతో కెరీర్ ను నెట్టుకొస్తున్న సందీప్ కిషన్ కు “ఒక్క అమ్మాయి తప్ప” సినిమా చాలా కీలకం. అలాంటి సినిమా ఈ విధంగా వాయిదా పడడంతో సందీప్ తెగ టెన్షన్ పడిపోతున్నాడట!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus