Chiranjeevi, Ram Charan: చిరంజీవి చరణ్ కాంబోలో మరో మూవీ రానుందా?

  • December 3, 2021 / 10:40 AM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం భారీ స్థాయిలో క్రేజ్ ఉన్న డైరెక్టర్లలో ప్రశాంత్ నీల్ ఒకరు. కేజీఎఫ్ ఛాప్టర్1 సినిమాతో పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించే సత్తా ఉన్న డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ పాపులారిటీని పెంచుకున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉండగా వచ్చే ఏడాది అక్టోబర్ నెల నుంచి తారక్ ప్రశాంత్ కాంబో మూవీ షూటింగ్ మొదలు కానుంది.

తారక్ సినిమా తర్వాత చరణ్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ పట్టాలెక్కనుందని సమాచారం. కొన్నిరోజుల క్రితం ప్రశాంత్ నీల్ చిరంజీవి, చరణ్ లను కలిసిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ చరణ్ తో ఈ సినిమాను చేయనున్నారని ఈ సినిమాలో గెస్ట్ రోల్ ను చిరంజీవితో చేయిస్తున్నారని సమాచారం. ఇప్పటికే చరణ్ హీరోగా తెరకెక్కిన మగధీర, బ్రూస్ లీ సినిమాలలో చిరంజీవి గెస్ట్ రోల్ లో నటించారు. ఆచార్య సినిమాలో చిరంజీవి, చరణ్ ఫుల్ లెంగ్త్ రోల్స్ లో నటిస్తున్నారు.

అయితే ప్రశాంత్ నీల్ చరణ్ కాంబో సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ సినిమాసినిమాకు ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వరుసగా సినిమాలను తెరకెక్కిస్తూ బిజీ అవుతున్నారు. చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నారు. చరణ్ కు జోడీగా ఈ సినిమాలో కియారా నటిస్తుండగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus