మహర్షి దర్శకుడికే మహేష్ మళ్ళీ ఓటేశాడు

  • January 9, 2020 / 06:27 PM IST

టాలీవుడ్ టాప్ స్టార్ మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీ ఇంకో రెండురోజులలో థియేటర్స్ లో సందడి చేయనుంది. సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఐతే సరిలేరు నీకెవ్వరు మూవీ తరువాత మహేష్ చేయనున్న చిత్రంపై అప్పుడే అభిమానులతో పాటు, సగటు సినీ ప్రేమికులలో ఆసక్తి పెరిగిపోయింది.కాగా ఈ విషయంపై మహేష్ స్వయంగా స్పష్టత ఇచ్చారు. గత ఏడాది మహేష్ కి మహర్షి వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు వంశీ పైడిపల్లితో మహేష్ తన తదుపరి చిత్రం చేస్తున్నారట. సరిలేరు నీకెవ్వరు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొన్న మహేష్ ఈ విషయాన్ని బయటపెట్టారు.

కొద్దిరోజుల క్రితం వంశీ పైడిపల్లి తాను మహేష్ తో మూవీ చేయనున్నట్లు ప్రకటించగా..నేటితో అది కన్ఫర్మ్ అయ్యింది. కాగా కొద్దిరోజులలో కుటుంబంతో కలిసి మహేష్ వెకేషన్ కు వెళ్లనున్నారట. ఆ వెకేషన్ అనంతరం ఓ మూడునెలలు విరామం తీసుకుని మహేష్ వంశీ పైడిపల్లి చిత్రానికి సంబంధించిన షూటింగ్ లో పాల్గొంటారట. గతంలో మహేష్ నెక్స్ట్ మూవీ కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా, పరుశురాం వంటి డైరెక్టర్స్ తో ఉంటుందని చాలా పుకార్లు వినిపించగా వాటన్నిటికీ నేటితో ఫుల్ స్టాప్ పెట్టినట్లైంది. మహర్షి చిత్రం తరువాత మహేష్, వంశీ పైడిపల్లి మంచి మిత్రులయ్యారు. మహేష్ కి సంబంధించిన ప్రతి వేడుకలో వంశీ కనిపిస్తున్నారు. మహర్షి మూవీ అనంతరం మహేష్ ఫ్యామిలీ తో వరల్డ్ టూర్ వెళ్లగా వంశీ లండన్ లో జాయిన్ అయ్యి క్రికెట్ మ్యాచ్ మహేష్ తో కలిసి వీక్షించారు.

దర్బార్ సినిమా రివ్యూ & రేటింగ్!
అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus