మరో సౌత్ రీమేక్ పై కన్నేసిన బాలీవుడ్?

  • July 4, 2019 / 06:01 AM IST

టాలీవుడ్ చిత్రాలు బాలీవుడ్ లో రీమేక్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ‘పోకిరి’ నుండీ ‘అర్జున్ రెడ్డి’ వరకూ చాలా చిత్రాలు రీమేక్ అవ్వడమే కాదు.. ఘన విజయాల్ని కూడా నమోదుచేశాయి. ప్రస్తుతం ‘ఎఫ్2’ ‘జెర్సీ’ వంటి చిత్రాలు రీమేక్ కానున్నాయి. ఇప్పుడు రాంచరణ్ హీరోగా వచ్చి సూపర్ హిట్టయిన ఓ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నారట. ఆ చిత్రం మరేదో కాదు. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో వచ్చిన ఎవడు, ఈ చిత్రం 2014 సంక్రాంతి కానుకగా విడుదలయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కూడా ఓ కీలక పాత్ర పోషించాడు.

ఈ రీమేక్ ను కూడా దిల్ రాజు బాలీవుడ్ నిర్మాత నిఖిల్ అద్వానీలతో కలిసి నిర్మించబోతున్నాడట. మిలాప్ జవేరీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఈ చిత్రంలో కొన్ని మార్పులు చేయబోతున్నారట. ఇక హీరోలు అయిన రాంచరణ్, అల్లు అర్జున్ పాత్రలు ఎవరు చేస్తారు అనేది తెలియాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus