సాయిపల్లవి హిస్టారికల్ లవ్ స్టోరీలో హీరో ఫిక్స్

  • August 21, 2018 / 12:49 PM IST

మలయాళ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకొన్న తమిళమ్మాయి సాయిపల్లవి ఇటీవల కాలంలో తెలుగులో వరుస సినిమాలతో, సొంత డబ్బింగ్ తో ప్రేక్షకుల్ని తన అభిమానులుగా మార్చేసుకొంటోంది. అమ్మడు ప్రస్తుతం తెలుగులో శర్వానంద్ సరసన “పడి పడి లేచే మనసు”లో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా అనంతరం “నీదీ నాదీ ఒకే కథ” చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించిన వరంగల్ అబ్బాయి వేణు ఉడుగుల దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. తేలంగాణ నేపధ్యంలో హిస్టారికల్ లవ్ స్టోరీగా రూపొందనున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రంలో కథానాయికగా ఎవరు నటిస్తారనే విషయంపై నిన్నటివరకు చిన్న కన్ఫ్యూజన్ ఉండేది. ఆ కన్ఫ్యూజన్ కి క్లారిటీ వచ్చింది.

సాయిపల్లవిని కథానాయికగా వెండితెరకు పరిచయం చేసిన మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలిని తెలుగు తెరకు పరిచయం చేసే కార్యక్రమాన్ని సాయిపల్లవి తన భుజస్కంధాలపై వేసుకొంది. ఈమేరకు ఆల్రెడీ మాటలు కూడా జరిగిపోయాయని, త్వరలోనే అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తుందని వినికిడి. ఈ కాంబినేషన్ గనుక సెట్ అయితే.. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లోనూ ఏకకాలంలో చిత్రీకరించేందుకు సన్నద్ధమౌతారు దర్శకనిర్మాతలు. చూద్దాం మరి ఈ ప్రొజెకి ఎక్కడి వరకూ వస్తుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus