హీరోగా సెకండ్ టైమ్ ట్రై చేస్తున్న సత్యం రాజేష్!

  • July 16, 2018 / 01:02 PM IST

పరిచయమైన సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న అతి కొద్ది మంది నటుల్లో రాజేష్ ఒకరు. సత్యం సినిమాలో ఆయన కామెడీ బాగా వర్కవుట్ అయింది. దీంతో ఆయన సత్యం రాజేష్‌గా స్థిర పడ్డాడు. మొన్నామధ్య తన తోటి కామెడియన్లు సునీల్, శ్రీనివాస్ రెడ్డిలు హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడంతో… తాను కూడా “నాయకి” చిత్రంలో హీరోగా ట్రై చేశాడు. ఆ ప్రయత్నం పెద్దగా ఫలించలేదనుకోండి. అయితే.. సునీల్ తరహాలో హీరో అయ్యాక కామెడీ రోల్స్ మానేయకుండా కామిక్ రోల్స్ చేస్తూనే వచ్చాడు.

మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత సత్యం రాజేష్ కి మళ్ళీ హీరోగా ఆఫర్ వచ్చింది. “గీతాంజలి, త్రిపుర” చిత్రాల దర్శకుడు రాజ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న “విశ్వామిత్ర” సినిమాలో నందిత హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈ చిత్రంలో సత్యం రాజేష్ కథానాయకుడిగా కనిపించనున్నాడు. థ్రిల్లర్ నేపధ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం టైటిల్ లోగోను ఇటీవల విడుదల చేశారు. మరి సత్యం రాజేష్ ఈ రెండో చిత్రంతోనైనా కథానాయకుడిగా తనను తాను నిరూపించుకొంటాడో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus