Mahesh Babu: మరోసారి కాలుకి సర్జెరీ చేయించుకోబోతున్న మహేష్..!

‘సర్కారు వారి పాట’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చే జనవరి నుండీ 3 నెలల పాటు రెస్ట్ తీసుకోబోతున్నాడట. దానికి ప్రధాన కారణం ఈ చిత్రం షూటింగ్ లో మహేష్ బాబు మోకాలికి గాయం అవ్వడమే అని తెలుస్తుంది. ‘సర్కారు వారి పాట’ షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. షూటింగ్ పూర్తయిన వెంటనే విదేశాలకి వెళ్ళి తన మోకాలికి సర్జెరీ చేయించుకోవాలని మహేష్ భావిస్తున్నాడట.

2014 నుండి మహేష్ కు మోకాలు సమస్యతో బాధపడుతున్నాడు.2017 ‘స్పైడర్’ టైంకి దాని తీవ్రత పెరిగింది.కానీ వెంటనే ట్రీట్మెంట్ తీసుకోలేదు.2020లో మహేష్ కాలుకి సర్జెరీ జరిగింది. కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుని మళ్ళీ షూటింగ్లో పాల్గొన్నాడు. ఇప్పుడు మరోసారి అతని మోకాలికి సర్జెరీ చేయించుకోవాలని డిసైడ్ అయ్యాడట. ఏప్రిల్ 1న ‘సర్కారు వారి పాట’ విడుదల కానుంది. మధ్యలో త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మొదలుపెట్టాలి అనుకున్నాడు కానీ ఈ కారణంతో.. ఇప్పుడు అది మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందట.

ఈ చిత్రానికి సంబంధించి క్యాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ ను కూడా ఆల్రెడీ టీం వెల్లడించిన సంగతి తెలిసిందే. హీరోయిన్ గా పూజా హెగ్డేని ఎంపిక చేసుకోవాలి అనుకున్నారు కానీ.. అనూహ్యంగా ఆమె ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఇక సంగీత దర్శకుడు తమన్ కంపోజ్ చేసిన 2 ట్యూన్లు కూడా ఫైనల్ అయినట్టు సమాచారం.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus