మళ్ళీ రిస్క్ చేస్తున్న విజయ్ దేవరకొండ!

  • December 13, 2018 / 09:18 AM IST

సెన్సషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రతో పాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో చిత్రం చేయబోతున్నాడు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నది. దీనితో పాటు తాజాగా విజయ్ మరో చిత్రాన్ని కూడా లైన్లో పెట్టినట్టు సమాచారం.

ఇది కూడా ‘నోటా’ లాగే ద్విభాషా చిత్రమట. ‘నోటా’ చిత్రంతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ నిరాశే మిగిలింది. అయినా సరే ఇప్పుడు మరో చిత్రానికి రెడీ అయ్యాడు. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ నిర్మించబోతుందని టాక్. ఈ చిత్రం శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. ఈ చిత్రంలో కూడా ‘పెళ్ళి చూపులు’ ఫేమ్ ప్రియదర్శి, ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ రాహుల్ రామకృష్ణ తో పాటు తమిళ కమెడియన్ యోగిబాబు కూడా నటించబోతున్నారట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు ప్రకటించనున్నట్టు సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus