పెయింటర్ అవతారం ఎత్తిన ‘ఎక్స్ ప్రెస్ రాజా’ హీరోయిన్ సురభి

  • February 19, 2016 / 02:24 PM IST

సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ కొట్టిన ‘ఎక్స్ ప్రెస్ రాజా’ చిత్రంలో శర్వానంద్ జోడిగా నటించిన సురభి ఆ సినిమా ఇచ్చిన హిట్ తో ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ క్రిష్ణ దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న ‘ధమాకా’ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది. తాజాగా సురభి గురించి ఎవరికీ తెలియని ఒక విషయం ఏంటంటే ఈ ముద్దుగుమ్మ అందంగా బొమ్మలు కూడా వేస్తుందట.
ఈ విషయం గురించి ఆమె  మాట్లాడుతూ ‘నేను ఫైన్ ఆర్ట్స్ అండ్ పెయింటింగ్ లో నాలుగు సంవత్సరాలు కోర్సు చేసాను. నేను ఆయిల్ అండ్ వాటర్ పెయింటింగ్ వేస్తాను. హీరోయిన్ అవకముందు పెయింట్ వేయాలంటే రిఫరెన్స్ కోసం గూగుల్లో వెతికేదాన్ని.., కాని ఇప్పుడు షూటింగ్ ల కోసం వివిధ ప్రదేశాలు చూసే అవకాశం లభించడంతో నాకు పెయింటింగ్ వేయడానికి కూడా చాలా ఆలోచనలు వస్తున్నాయి’ అని తెలిపింది. నానితో చేస్తున్న ‘ధమాకా’ షెడ్యూల్ కొడైకెనాల్ లో ఉండటంతో ఈసారి తప్పకుండా స్కెచ్ పాడ్, పెన్సిల్స్ తీసుకెళ్తానని చెప్పింది.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags