పంతం ఫస్ట్ డే కలక్షన్స్

  • July 6, 2018 / 08:07 AM IST

జయం, నిజం, వర్షం సినిమాలతో విలన్ గా మంచి పేరు తెచ్చుకున్న గోపిచంద్ హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడ్డారు. రణం, లౌక్యం సినిమాల్తో హీరోగా హిట్ అందుకున్న గోపిచంద్ కొంతకాలంగా విజయం కోసం ఎదురుచూస్తున్నారు. తన కెరీర్ కి మైలురాయిగా నిలిచే 25 వ చిత్రాన్ని నూతన దర్శకుడు చక్రవర్తి దర్శకత్వంలో పంతం సినిమా చేశారు. యాక్షన్‌ అండ్‌ మెసెజ్‌ ఓరియెంటెడ్‌గా తెరకెక్కిన ఈ మూవీ నిన్న (గురువారం జూలై 5) విడుదలై మిశ్రమ స్పందన అందుకుంది. అయినప్పటికీ మంచి కలక్షన్స్ రాబట్టింది. గోపిచంద్‌ సరసన మెహ్రీన్‌ జోడిగా నటించిన ఈ మూవీ మొదటి రోజే దాదాపు 5 .2 కోట్ల షేర్‌ను వసూలు చేసింది.

షేర్ కూడా ఎక్కువగా వచ్చింది. 3 . 22 కోట్ల గ్రాస్‌ను రాబట్టి తన కెరీర్ లోనే ఎక్కువ షేర్ వసూలు చేసిన చిత్రంగా పంతం నిలిచింది. నటీనటుల అద్భుత నటనకు గోపిసుందర్‌ ఇచ్చిన సంగీతం ప్లస్ అయింది. సత్యసాయి ఆర్ట్స్ పతాకంఫై కే కే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రానికి వీకెండ్స్ లో కలక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. ఈ వారంలో పెద్ద స్టార్ సినిమాలు ఏవి లేకపోవడం, ఈరోజు రిలీజ్ అయిన సాయి ధరమ్ తేజ్ మూవీ “తేజ్ ఐ లవ్ యూ” అంతంత మాత్రంగా ఉండడం.. అనే అంశాలు పంతం కలక్షన్స్ పై తప్పకుండా ప్రభావం చూపిస్తాయని ట్రేడ్ వర్గాల వారు చెప్పారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus