తన నెక్స్ట్ హీరోని ఖరారు చేసిన పరశురామ్

  • August 16, 2018 / 11:29 AM IST

“యువత” సినిమాతో దర్శకుడిగా పరిచయమయిన పరశురామ్.. “సోలో” సినిమాతో ఫ్యామిలీ చిత్రాలను చక్కగా తెరకెక్కించగలరని నిరూపించుకున్నారు. ఆంజనేయులు, సారొచ్చారు అనే చిత్రాలతో ఫరవాలేధనిపించినా అల్లు శిరీష్ “శ్రీరస్తు శుభమస్తు” సినిమా తెరకెక్కించి విజయాన్ని అందుకున్నారు. అంతేకాదు గీతా ఆర్ట్స్ లోనే మరో ఛాన్స్ అందుకున్నారు. విజయ్ దేవరకొండతో “గీత గోవిందం” సినిమాని తీశారు. రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నిన్న (ఆగష్టు 15 న) రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో అతనికి ఆఫర్లు వెల్లువెత్తాయి. అనేక మంది హీరోలు తాము నటిస్తామని స్వయంగా ఫోన్ చేసి చెబుతున్నారు. అయితే పరశురామ్ మాత్రం మంచు విష్ణు తో సినిమా తీయడానికి ఫిక్స్ అయినట్లు తెలిసింది.

లక్ష్మిప్రసన్న పిక్చర్స్ బ్యానర్ లో ఈ సినిమాను డా. మోహన్ బాబు నిర్మించనున్నారు. ఈ సినిమా కూడా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. మంచు విష్ణు కొంతకాలంగా విజయానికి దూరంగా ఉన్నారు. “ఆచారి అమెరికా యాత్ర” తర్వాత అతను చేస్తున్న “ఓటర్” కూడా నెమ్మదిగా షూటింగ్ జరుపుకుంటోంది. అందుకే గీత గోవిందంతో క్రేజీ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న పరశురామ్ దర్శకత్వంలో నటించడానికి ఓకే చెప్పారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus