అడ్వాన్స్ గా అపార్ట్ మెంట్ కూడా తీసేసుకొన్నాడట

  • August 20, 2018 / 12:35 PM IST

సక్సెస్ వెంట ఇండస్ట్రీ పరుగు తీస్తుందని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలాసార్లు ఆ విషయం ప్రూవ్ అయ్యింది. తాజాగా సూపర్ హిట్ అందుకొన్న పరశురామ్ వెనుక కూడా నిర్మాతలు క్యూ కడుతున్నారు. “శ్రీరస్తు శుభమస్తు” తర్వాత పరశురామ్ ను ఎవరూ పట్టించుకోలేదు. కానీ.. అతడి టాలెంట్ ను గుర్తించిన బన్నీ వాసు “గీత గోవిందం”తో మరో అవకాశాన్నిచ్చాడు. ఆ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగపరుచుకోవడంతోపాటు బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్న పరశురామ్ ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారాడు. నిజానికి “గీత గోవిందం” అనంతరం పరశురామ్ తదుపరి చిత్రం మంచు విష్ణు హీరోగా ఉండాలీ. కానీ.. “గీత గోవిందం” సక్సెస్ అనంతరం తమ బ్యానర్ లోనే మరో సినిమా తెరకెక్కించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు బన్నీవాసు.

ఈమేరకు ఆల్రెడీ పరశురామ్ కు అడ్వాన్స్ గా తాను ఇష్టపడి కొనుక్కొన్న ఫ్లాట్ కీస్ కూడా ఇచ్చేశాడట. అయితే.. ఈ సినిమాలో హీరోగా వరుణ్ తేజ్ నటించనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం “అంతరిక్షం, F2” చిత్రాలతో బిజీగా ఉన్న వరుణ్ తేజ్.. అనంతరం సాగర్ చంద్ర దర్శకత్వంలో మరో సినిమా అంగీకరించాడు. ఈ మూడు సినిమాల్లో రెండు ఆల్రెడీ పూర్తికావచ్చాయి. మూడో సినిమా కంప్లీట్ చేసుకొనేలోపు పరశురామ్ ప్రీప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేస్తే.. వచ్చే ఏడాది వరుణ్-పరశురామ్ ప్రొజెక్ట్ సెట్స్ మీదకు వెళ్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus