విశ్వనాథ్‌ ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన పవన్, త్రివిక్రమ్

  • April 26, 2017 / 07:15 AM IST

భారత సినీ రంగంలో అత్యున్నత దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారానికి కళాతపస్వి కె.విశ్వనాథ్‌ ఎంపికకావడం తెలుగు చిత్ర పరిశ్రమని ఆనందంలో ముంచెత్తుతోంది. దర్శకులు, నటులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పారు. టాలీవుడ్ వర్గాల వారు గర్వంగా ఫీలవుతున్నారు. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ సోషల్ మీడియాలో విషెష్ తెలిపారు. నిన్న మెగాస్టార్ చిరంజీవి కళాతపస్విని కలిసి శుభాకాంక్షలు తెలిపి ఆ పురస్కారానికే నిండుదనం వచ్చిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఈ రోజు  పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం విశ్వనాథ్‌ నివాసానికి వెళ్లిన పవన్‌, త్రివిక్రమ్‌ ఆయన్ని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం వారు విశ్వనాథ్‌తో కాసేపు ముచ్చటించారు. ఆర్ట్ సినిమాలు కూడా కమర్షియల్ హిట్ సాధిస్తాయని నిరూపించిన డైరక్టర్ కళాతపస్వి విశ్వనాధ్. అయన దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో మీకు ఏది ఇష్టమని పవన్ కళ్యాణ్ ని అడగగా.. శుభలేఖ, శంకరా భరణం, స్వాతి ముత్యం, స్వయం కృషి ఇష్టమని వెల్లడించారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా లైక్లు అందుకుంటోంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus