Pawan Kalyan: హరీష్ శంకర్ పై ‘బ్లాక్’ ఎఫెక్ట్!

Advertisement

గతంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ రూపొందించిన సంగతి తెలిసిందే. వసూళ్ల విషయంలో ఆ సినిమా వివాదాస్పదమైంది. పవన్ కళ్యాణ్ సినిమాను మించి బన్నీ సినిమా వసూళ్లు సాధించిందని చెప్పడంతో పవన్ ఫ్యాన్స్ హరీష్ శంకర్ పై మండిపడ్డారు. సోషల్ మీడియా హరీష్ ను టార్గెట్ చేయడంతో ఆయన చాలా ట్విట్టర్ అకౌంట్లను బ్లాక్ చేశాడు. తాజాగా పవన్ తో సినిమా అనౌన్స్ చేశాడు హరీష్ శంకర్.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై త్వరలోనే ఆ సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ సందర్భంగా పవన్ ఫ్యాన్స్ నుంచి తాకిడి ఎక్కువ అవ్వడంతో మరికొంతమందిని బ్లాక్ చేశాడు. అలా పవన్ ఫ్యాన్స్ చాలా మంది హరీష్ ట్విట్టర్ అకౌంట్ కి అందుబాటులో లేకుండా పోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు హరీష్ శంకర్ తో చేయబోయే సినిమాకి సంబంధించిన అప్డేట్ రాబోతుంది. ఆ అప్డేట్ ను హరీష్ శంకర్ అకౌంట్ నుండి మాత్రం ట్వీట్ పెట్టొద్దని నిర్మాతలకు రిక్వెస్ట్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్.

సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ అయినా.. మైత్రి మూవీ మేకర్స్ అకౌంట్ నుంచి మాత్రమే చేస్తున్నారు. అప్పుడు మాత్రమే ట్రెండింగ్ సాధ్యమని.. హరీష్ శంకర్ అకౌంట్ నుండి చేస్తే రీచ్ సరిగ్గా ఉండదని అంటున్నారు. మొత్తానికి హరీష్ శంకర్ పై ఈ బ్లాక్ ల ఎఫెక్ట్ బాగానే పడినట్లుంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus