డైరెక్టర్ క్రిష్ వల్ల ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు…!

  • April 25, 2020 / 08:54 PM IST

డైరెక్టర్ క్రిష్ తన సినిమాల వల్ల అందరికీ హ్యూమన్ ఎతిక్స్ నేర్పిస్తూ ఉంటాడు. ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నెలకొల్పిన ‘బి ది రియల్ మెన్’ ఛాలెంజ్ ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ అంతా పర్సనల్ గా తీసుకునే వరకూ వెళ్ళింది. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న సెలబ్రిటీలు తమ ఇంట్లో ఉన్న లేడీస్ కు ఇంటి పనులు, వంట పనులు చేసి పెట్టాలి. వాళ్ళని ప్రిన్సెస్ లా కూర్చో పెట్టి వారికి సేవలు చేయాలనేది దీని ముఖ్య ఉద్దేశం.

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, దర్శక ధీరుడు రాజమౌళి, కొరటాల శివ, విక్టరీ వెంకటేష్, బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, క్రిష్ వంటి స్టార్ లు ఈ ఛాలెంజ్ ను స్వీకరించి వీడియోలను పోస్ట్ చేసారు. అయితే డైరెక్టర్ క్రిష్ తన ఛాలెంజ్ ను పూర్తి చేసాక… ఇది చాలా మంచి ఆలోచన దీనిని దేశం మొత్తం పాపులర్ చేసి.. ఆడవాళ్ళకు రిలీఫ్ ఇచ్చి అందరినీ ‘రియల్ మేన్స్’ గా చెయ్యాలి అనుకున్నాడు అనుకుంట. ఏకంగా వరల్డ్ వైడ్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ ఈ ఛాలెంజ్ విసిరాడు.

దీంతో ఇప్పుడు పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంతా ఈ ఛాలెంజ్ ను స్వీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ ఏ విషయాన్ని అయినా వైరల్ చెయ్యగలరు అని క్రిష్ కనిపెట్టేసినట్టు ఉన్నాడు. అయితే ఓ పవన్ అభిమాని నిజమైన మగాళ్ళు అంతా ఇంట్లో ఉండే మహిళలతో పాటు బద్దకస్తులు అయిన మగవాళ్ళకు కూడా సేవ చెయ్యాలి అంటూ ఘాటు కామెంట్ చేసాడు. ఇక క్రిష్ … పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus