భార్య, పిల్లలతో ఇటలీ వెళ్లిన పవన్ కళ్యాణ్!

  • March 6, 2017 / 11:01 AM IST

డాలీ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న‘కాటమరాయుడు’ సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకొని.. మిగిలిన రెండు పాటల కోసం ఇటలీ వెళ్లింది.  పవన్ కూడా రెండురోజుల క్రితమే ఇటలీ చేరుకున్నట్లు సమాచారం. ఒక్కడిగా కాకుండా భార్య అన్నా లెజినోవా, పిల్లలని కూడా వెంట తీసుకుకెళ్లినట్టు తెలిసింది. ఈ మధ్య పవన్ కి కుటుంబ సభ్యులతో గడిపేందుకు సమయం దొరకడం లేదు. జనసేన పార్టీ ని బలపరిచే పనులతో పాటు ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ బిజీగా ఉంటున్నారు.

వారు పవన్ ని మిస్ అవుతున్నారు. అందుకే దొరికిన ఈ సమయాన్ని ఇలా వినియోగించుకుంటున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే శృతి హాసన్ హీరోయిన్ గ నటించిన ఈ మూవీ కి పాటల వేడుక నిర్వహించడంలేదు. ఇటలీ షెడ్యూల్ పూర్తి అయినా వెంటనే  ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించాలని నిర్మాత శరత్ మరార్ సన్నాహాలు చేస్తున్నారు.  రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ కథలో పవర్ స్టార్ తొలిసారి ఫ్యాక్షన్ లీడర్ గా నటిస్తున్నారు.  అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్న ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 24 న థియేటర్లోకి రానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus