ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి రావడం లేదని చెప్పిన పవన్ కళ్యాణ్

  • January 7, 2017 / 10:02 AM IST

మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల తర్వాత హీరోగా చేసిన చిత్రం ఖైదీ నంబర్ 150  ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు మంగళగిరిలోని హాయ్ ల్యాండ్ లో వైభవంగా జరగనుంది. ఇందుకోసం గత మూడు  రోజులుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఫంక్షన్ కి మెగాస్టార్ కుటుంబానికి చెందిన అందరూ హాజరవుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వస్తారని అందరూ ఆశించారు. కానీ రావడం లేదని తెలిసింది. ఈ విషయాన్నీ పవన్ తన ట్విట్టర్ అకౌంట్ లో అభిమానులకు తెలిపారు. “చరణ్, మా వదిన సురేఖాగారి నిర్మాణంలో వస్తున్న తొలి చిత్రమే చిరంజీవి గారి 150 వ చిత్రం కావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఖైదీ నంబర్ 150 ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను.

ఈ చిత్రంలోని నటీనటులకు, పనిచేసిన సాంకేతిక నిపుణులకు నా శుభాకాంక్షలు” అంటూ ఈరోజు ట్వీట్ చేసి సస్పెన్స్ కి తెరదించారు. ఈ ఒక్క ట్వీట్ తో తాను ఈవెంట్ కి రావడం లేదని ఇండైరెక్ట్ గా చెప్పారు. దీంతో అభిమానులు కొంత నిరుత్సాహానికి గురి అయినప్పటికీ చిరు మూవీ గురించి మాట్లాడినందుకు ఆనందపడుతున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus