‘అభిమాని’కోసం నిర్మాతగా మారిన పవన్!!!

  • November 17, 2016 / 09:58 AM IST

పవన్ కల్యాణ్….అన్న పదం వింటే….హీరోగా…దర్శకుడిగా….రాజకీయ నాయకుడిగా….ఇంకా చెప్పాలి అంటే సమాజ సేవకుడిగా మనకు గుర్తొస్తాడు. అయితే ఇప్పటివరకూ పవన్ నటించిన సినిమా వల్ల కానీ…అటు పవన్ కొత్త పార్టీ వల్ల కానీ మంచి పేరే సంపాదించుకున్నాడు.అయితే అదే క్రమంలో ఇప్పటివరకూ ఇండస్ట్రీలో ఎన్నో పాత్రలు పోషించిన పవన్ ఇప్పుడు తన అభిమాని కోసం నిర్మాతగా కూడా మారడం విశేషం…ఇంతకీ ఎవరా అభిమాని..ఏమా కధ అంటే…నిమా ఇండస్ట్రీలో మొదటి నుంచి పవన్ కళ్యాన్ పిచ్చిగా అభిమానించే హీరో నితిన్. అదే క్రమంలో నితిన్ అంటే పవన్ కు ఎనలేని గౌరవం అనే చెప్పాలి…ఇదిలా ఉంటే మాటల మాంత్రికుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శీనివాస్,   ప్రముఖ పంపిణిదారుడు, నిర్మాత  సుధాకర్ రెడ్డి కలిసి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రముఖ లిరిసిస్ట్ కృష్ణ చైతన్య దర్శకుడు. తొలిసారి పవన్ కల్యాణ్ తాను కాకుండా  తన బ్యానర్ పై మరో హీరో నితిన్  కొసం నిర్మాతగా మారటం విశేషం. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలతో పాటు మూల కధను సమకూర్చటం మరో హైలెట్. ఇక ఇంతటి క్రేజీ కాంబినేషన్ లో సినిమా పట్టాలు ఎక్కడంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు…ఈ చిత్రం పూజా కార్యక్రమాలు శ్రేష్ట్ మూవీస్ సంస్థ కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగాయి. దేవుని పటాలపై చిత్రీకరించిన  ముహూర్తపు షాట్ కు పవన్ కల్యాణ్ క్లాప్ నివ్వగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ కెమెరా స్విచ్చాన్ చేశారు.  హీరోయిన్ ,నటీనటులు, పూర్తి టెక్నికల్ టీమ్ మరియు షూటింగ్ సంబందిత వివరాలను త్వరలొనె తెలియచెస్తారు . చూద్దాం మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఎలాంటి సక్సెస్ ను అందుకోనుంధో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus