Pawan Kalyan: భార్యతో కలిసి ఇటలీ బయలుదేరిన పవన్.. ఫోటోలు వైరల్!

  • October 28, 2023 / 02:46 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నవంబర్ ఒకటవ తేదీ ఎంతో ఘనంగా నటి లావణ్య త్రిపాఠిన పెళ్లి చేసుకోబోతున్న సంగతి మనకు తెలిసిందే. మిస్టర్ సినిమాలో కలిసి నటించిన వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఇక అప్పటినుంచి వీరి ప్రేమ విషయం రహస్యంగా ఉంచి చివరికి జూన్ 9వ తేదీ నిశ్చితార్థం చేసుకోబోతున్నాం అంటూ ప్రకటించారు. ఇలా ఇప్పటికే నిశ్చితార్థం జరుపుకున్నటువంటి పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే.

నవంబర్ ఒకటో తేదీ ఇటలీలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఒక్కొక్కరు ఇటలీ చేరుకుంటున్నారు. ఇప్పటికే నాగబాబు కుటుంబ సభ్యులతో పాటు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కూడా ఇటలీ చేరుకున్నారు. అయితే నేడు పవన్ కళ్యాణ్ ఆయన సతీమణి ఇటలీ వెళ్లారు. పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజినోవాతో కలిసి వరుణ్ తేజ్ పెళ్లి కోసం ఇటలీ వెళ్లారు. వీరి ఎయిర్ పోర్ట్ కి సంబంధించినటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు రాజకీయాలు అంటూ చాలా బిజీగా ఉన్నారు అయితే వాటిని పెట్టి తన అన్నయ్య కొడుకు పెళ్లి వేడుకల కోసం ఇటలీ వెళ్లారు. ఇలా అన్నా లెజినోవా మీడియాకి కనిపించడం, పబ్లిక్ లో తిరగడం చాలా తక్కువ. ఇలా పవన్, లెజినోవా కనిపించడంతో కెమెరా కంటికి చిక్కారు. ఈ దృశ్యాలని పవన్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. ఇలా మెగా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా ఇటలీ చేరుకుంటున్నారు.

నవంబర్ ఒకటవ తేదీ వీరి పెళ్లి జరగగా 5 వ తేదీ వీరి రిసెప్షన్ హైదరాబాద్ లో జరగబోతుంది. ఈ రిసెప్షన్ కి పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరు కాబోతున్నారు. ఇక వెడ్డింగ్ రిసెప్షన్ కి సంబందించిన ఇన్విటేషన్ కార్డు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus