పవన్, త్రివిక్రమ్ సినిమాకి కొత్త రకం ప్రచారం

  • October 14, 2017 / 01:47 PM IST

సినిమా ప్రచారంలో సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తోంది. అత్యంత వేగంగా సినిమా విశేషాలు అరచేతిలో ప్రత్యక్షమవుతున్నాయి. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి సినిమా గురించి వివరించే వీలు దొరుకుతోంది. అందుకే ఫిలిం మేకర్స్ రకరకాల సొషల్ మీడియాలో ప్రచార కార్యక్రమాలు చేబడుతున్నారు. అందులో భాగమే ఎమోజీస్. దక్షిణాదిన విజయ్ సినిమా ‘మెర్సల్’కు తొలిసారి ఎమోజీస్‌తో ప్రచారం మొదలెట్టారు. శంకర్, రజనీకాంత్ ‘2.0’ సినిమాకు కూడా ఈ ఏర్పాట్లు సాగుతున్నాయి.

తెలుగులో బాహుబలి 2 కి పేస్ బుక్ స్టిక్కర్స్ రిలీజ్ చేశారు. కానీ ఎమోజీస్ ని తొలిసారి పవన్ మూవీ తో ప్రవేశపెట్టబోతున్నారు. త్రివిక్రమ్, పవన్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ మూవీ కోసం స్పెషల్ ఎమోజీస్ ని సిద్ధం చేస్తున్నారు. త్వరలో రిలీజ్ చేయనున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్లలో రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్యానియాల్, కీర్తి సురేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కుష్బూ కీలక పాత్రలో కనిపించనున్న ఈ మూవీ సంక్రాంతిని పురస్కరించుకొని జనవరి 10 న విడుదల కాబోతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus