పవన్, త్రివిక్రమ్‌ చిత్రం షూటింగ్ కి బ్రేక్

  • June 8, 2017 / 09:07 AM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  చేస్తున్న సినిమా ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. మొదట హీరో పవన్, హీరోయిన్లు అను ఇమ్మానియేల్ , కీర్తి సురేష్ లపై కొన్ని సరదా సన్నివేశాలను షూట్ చేసిన త్రివిక్రమ్, ఇప్పుడు యాక్షన్ సీన్ తెరకెక్కిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కుష్బూ కీలక రోల్ పోషిస్తోంది. పవన్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఎండలను సైతం షూటింగ్ చేసిన త్రివిక్రమ్.. ఇప్పుడు షూటింగ్ కి రెండు వారాలు బ్రేక్ ఇస్తున్నట్లు తెలిసింది.

దీనికి కారణం ఈ సినిమా విడుదలను సెప్టెంబర్‌ నుంచి వచ్చే జనవరికి వాయిదా వేయడమే. సెప్టెంబర్ లో జై లవకుశ,  రిలీజ్ కి మరో ఐదునెలల గ్యాప్ ఉండడంతో హడావుడి పడడం ఎందుకని డైరక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ బ్రేక్ లో సొంతంగా నిర్మించే సినిమాతో  త్రివిక్రమ్‌, పవన్‌ బిజీ కానున్నారు. అంతేకాకుండా ఈ గ్యాప్‌లో తన ‘జనసేన’కు సంబంధించిన కొన్ని కార్యక్రమాలు పవన్‌ చేపడతారని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus