వైరల్ అవుతున్న పూజా హాట్ ఫోటోలు

  • September 18, 2022 / 07:53 PM IST

గతంలో నాగార్జున, అఖిల్ నటించిన ‘సిసింద్రీ’ సినిమాలో నటించిన పూజా బాత్రా అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ తరువాత ఈమె దాసరి అరుణ్ కుమార్ హీరోగా నటించిన ‘గ్రీకు వీరుడు’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉండగా ఈమె పెళ్ళి విషయమై ఈ మధ్య ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. ఈమె గత కొంతకాలం నుండీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నవాబ్ షాతో సహజీవనంలో ఉంది. అయితే జూలై లో ఢిల్లీ వేదికగా ఓ ప్రైవేట్ వెన్యూలో సీక్రెట్ గా పెళ్ళి చేసుకుందని తెలిసింది. ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు.. బంధు మిత్రుల సమక్షంలో ఈ వివాహం చేసుకున్నట్టు తెలుస్తుంది.

ఇక పెళ్లి తర్వాత విదేశాల్లో ఒంటరి దీవుల సెలబ్రేషన్ కి వెళ్ళింది ఈ జంట. హబ్బీ నవాబ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ భామ ఫోటోలు అప్పట్లో తెగ వైరలయ్యాయి. కానీ ఈ అమ్మడికి పెళ్ళైన సంగతి మాత్రం కొంచెం లేట్ గా ప్రకటించింది పూజా. ‘పెళ్ళికి ముందు ఎంతో ఆలోచించాను.. బ్యాలెన్స్ లైఫ్ కి ఇతడు కరెక్ట్ అని భావించాకే ఇలా పెళ్ళి చేసుకున్నాను. ఆర్య సమాజంలో మా పెళ్ళి జరిగింది. ఇంకా పెళ్ళిని రిజిస్టర్ చేయలేదు. ఈ వారంలో ఆ ఫార్మాల్టీస్ పూర్తి చేస్తాము’ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో ఈ జంటకు సంబందించిన 30-40 ఫోటోలు తెగ వైరలవుతున్నాయి.

1

2

3

4

5

6

7

8

9

10

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus