రెమ్యునరేషన్ విషయంలో నో కాంప్రమైజ్!

  • October 16, 2020 / 12:15 PM IST

‘డీజే’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ ఇమేజ్ దక్కించుకుంది పూజాహెగ్డే. ఆ సినిమా తరువాత టాలీవుడ్ లో వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ‘అరవింద సమేత’, ‘మహర్షి’ రీసెంట్ గా ‘అల.. వైకుంఠపురములో’ వంటి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. యూత్ లో ఈమెకి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఈ బ్యూటీ ఏ విషయంలోనూ రాజీ పడడం లేదు. కోవిడ్ క్రైసిస్ కారణంగా తెలుగు నిర్మాతలంతా కలిసి స్టార్లకు ఇచ్చే రెమ్యునరేషన్ లో ఇరవై శాతం తగ్గించాలని నిర్ణయించుకున్నారు. కానీ పూజా మాత్రం ఈ విషయంలో తగ్గేదే లేదంటుంది.

బాలీవుడ్ లో తనకు ఆఫర్లు వస్తున్నాయని.. ఈ క్రమంలో రెమ్యునరేషన్ తగ్గించుకొని నటించే ఛాన్స్ లేదని చెబుతోందట. టాలీవుడ్ చిత్రాల కోసం సంప్రదిస్తే.. బాలీవుడ్ లో ఎంత ఆఫర్ చేస్తున్నారో అంతే ఇవ్వాలని పట్టుబడుతోందట. రీసెంట్ గా ఓ తెలుగు సినిమా కోసం ఈ బ్యూటీ రూ.2.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే రేంజ్ లో మిగిలిన సినిమాల విషయంలో కూడా డిమాండ్ చేస్తుందని సమాచారం. పూజాకి ఉన్న క్రేజ్ కారణంగా నిర్మాతలకు వేరే ఆప్షన్ లేకుండా పోయింది. దీంతో ఆమె అడిగినంత ఇవ్వాలని నిర్ణయించుకున్నారట.

ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా పూజా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. అలానే అఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటిస్తోంది. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లే. సరైన డేట్ ని ఫిక్స్ చేసి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. రీసెంట్ గా పూజాహెగ్డే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన ‘కబీ ఈద్ కబీ దివాలీ’ అనే సినిమాలో నటించడానికి అంగీకరించింది.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus