బాలీవుడ్ సినిమా ప్రమోషన్స్ కోసం తెలుగు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది!

  • October 23, 2019 / 10:11 AM IST

తెలుగులో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిన పూజా హెగ్డే.. తెలుగు సినిమాల నుంచి బ్రేక్ తీసుకొంది. అది కూడా తాను హీరోయిన్ గా నటిస్తున్న సినిమాలు రెండు షూటింగ్ దశలో ఉండగా. ఇంత పీక్ టైమ్ లో అమ్మడు బ్రేక్ తీసుకోవడానికి కారణం ఏంట్రా అంటే బాలీవుడ్ లో ఆమె నటించిన రెండో సినిమా “హౌస్ ఫుల్ 4”. ఈ సినిమాను ఇండియాలోని అన్నీ రాష్ట్రాల్లోనూ ప్రమోట్ చేస్తున్నారు. ఆ ప్రమోషన్స్ లో పూజా హెగ్డే కూడా పాల్గొంటుంది.

అందుకే.. అఖిల్ 4వ సినిమా మరియు అల్లు అర్జున్ “అల వైకుంఠపురములో” షూటింగ్ దశలో ఉండగా కూడా ఆ సినిమాకు బ్రేక్ ఇచ్చి మరీ “హౌస్ ఫుల్ 4” ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. దీపావళి తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలకు డేట్స్ ఇస్తుందట. మరి పూజా ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్న సెకండ్ హిందీ సినిమాకు ఆమెకు ఎలాంటి రిజల్ట్ ను కట్టబెడుతుందో చూడాలి.

1

2

3

4

5

6

7

8

9

10

బర్త్ డే స్పెషల్ : ప్రభాస్ రేర్ అండ్ అన్ సీన్ పిక్స్…!
బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus