ఎన్టీఆర్ సెట్స్ లో జాయిన్ అయిన పూజ హెగ్డే

  • May 14, 2018 / 06:35 AM IST

“దువ్వాడ జగన్నాధం”లో అందాలతో ఆకట్టుకొన్న పూజా హెగ్డే ప్రస్తుతం “ఎన్టీయార్, మహేష్ బాబు, ప్రభాస్”ల సరసన కథానాయికగా వరుస అవకాశాలు సొంతం చేసుకొన్న పూజా హెగ్డే నిన్నటివరకూ ఆ సినిమాల షూటింగ్స్ మొదలవ్వకపోవడంతో మ్యాగజైన్ ఫోటోషూట్స్ చేసుకుంటూ టైమ్ పాస్ చేసిన పూజ హెగ్డే ఇవాల్టి నుంచి ఎన్టీయార్ షూటింగ్ మొదలెట్టింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ఎన్టీయార్ ఆల్రెడీ స్లిమ్ అండ్ సిక్స్ ప్యాక్ లుక్ రెడీ చేసుకోగా.. పూజా హెగ్డే కూడా ఈ చిత్రంలో ఒక డిఫరెంట్ కల్చరల్ లుక్ తో కనువిందు చేయనుంది.

“అజ్ణాతవాసి” అనంతరం రాధాకృష్ణ-త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ ఎన్నడూలేని విధంగా స్క్రిప్ట్ విషయంలో కొన్నాళ్లు ఎక్కువగా వర్క్ చేయడమే కాకుండా.. కథకు కావాల్సినన్ని మెరుగులు దిద్దాడు. ఈ సినిమాతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టి “అ ఆ, అజ్ణాతవాసి” చిత్రాలతో తాను మూటగట్టుకున్న చెడ్డ పేరును ఎన్టీయార్ సినిమాతో తెరకెక్కించబోయే చిత్రంతో పోగొట్టుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు త్రివిక్రమ్. అందుకే తాను ఇప్పటివరకూ ప్రయత్నించని ఫ్యాక్షన్ జోనర్ లో ఓ డిఫరెంట్ యాక్షన్ లవ్ స్టోరీని తెరేకక్కిస్తున్నాడు. ఎన్టీయార్, పూజా హెగ్డేలతోపాటు నాగబాబు కూడా ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తుండడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus