మహేష్, ఎన్టీఆర్ పక్కన ఛాన్స్ అందుకున్న పూజా హెగ్డే!

  • October 31, 2017 / 07:17 AM IST

పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే ముకుందలో హోమ్లీగా నటించింది. మంచి పేరు వచ్చింది గానీ అవకాశాలు మాత్రం తలుపుతట్టలేదు. దువ్వాడ జగన్నాథంలో కాస్త స్కిన్ షో చేసిందో లేదో అవకాశాలు తన్నుకుంటూ వస్తున్నాయి. డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రంగస్థలం 1985 లో స్పెషల్ సాంగ్ లో డ్యాన్స్ చేసే ఆఫర్ అందుకుంది. ఇప్పుడు మరో రెండు భారీ ప్రాజక్ట్ లో ప్రధాన హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, వంశీ పైడి పల్లి కలయికలో రూపుదిద్దుకోనున్న సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ని సెలక్ట్ చేసినట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు.

ఇంకా జై లవకుశ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమాలోను పూజ హెగ్డే హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు తెలిసింది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నారు. ఇది పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ ప్రాజక్ట్ పట్టాలెక్కించనున్నారు. మహేష్ కూడా భరత్ అనే నేను షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే వంశీ పైడిపల్లి మూవీ షూటింగ్ మొదలెట్టనున్నారు. ఈ రెండో చిత్రాలతో పూజా బిజీ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus