తారక్ కోసం మరింత సన్నబడుతోన్న పూజా హెగ్డే!

  • March 9, 2018 / 05:12 PM IST

ముకుందా, ఒక లైలా కోసం సినిమాల్లో పూజా హెగ్డే నటనకు మంచి పేరు వచ్చింది కానీ ఛాన్స్ లు మాత్రం తెచ్చిపెట్టలేకపోయింది. అల్లు అర్జున్ తో ఆమె చేసిన దువ్వాడ జగన్నాధం మాత్రం నటిగా బిజీ చేసింది. ఇందులో ఆమె అందంతో ప్రేక్షకులను  ఆకట్టుకోవడంతో.. ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ బ్యూటీ రంగస్థలంలో రామ్ చరణ్ సరసన ఓ ప్రత్యేక పాటలో అందాలు ఆరబోసింది. అలాగే బెల్లంకొండ  శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సాక్ష్యం సినిమాలోను ఆకట్టుకోనుంది. ఈ సినిమాని దాదాపు కంప్లీట్ చేసిన ఈ భామ ఎన్టీఆర్ మూవీ కోసం కష్టపడుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రం కోసం తారక్ బరువు తగ్గి మరింత ఫిట్ గా తయారవుతున్నారు.

అతనికి జోడీగా ఎక్కువ మార్కులు కొట్టాలంటే తారక్ కంటే మరింత స్లిమ్ గా ఉండాలని ఎక్కువ సేపు జిమ్ లోనే గడుపుతోంది.  తాజాగా ఆమె జిమ్ నుంచి బయటికి వస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. వీటిని చూసిన కుర్రకారు మతులు పోగొట్టుకుంటున్నారు. ఇక సినిమాలో ఇంకెంత అందంగా కనిపించబోతుందోనని ఆశ్చర్యపోతున్నారు. పూజా ఎన్టీఆర్ చిత్రం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించనుంది. స్టార్ హీరోల సరసన వచ్చిన ఈ అవకాశాలను వినియోగించుకొని స్టార్ హీరోయిన్ అయిపోవడానికి పూజా బాగానే ప్లాన్ వేసినట్టుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus