ఆవేదన వ్యక్తం చేసిన పూనమ్ కౌర్

  • September 5, 2018 / 09:22 AM IST

ఇతరులు గురించి మనం మాట్లాడే మాటలు వారిని గాయపరిస్తాయి. ఆ గాయం ఎప్పటికి మానదు. తిరిగి అవకాశం వచ్చినప్పుడు వారు మనల్ని మాటలతో గాయపడుస్తారు. అప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ప్రస్తుతం ఆ బాధని అనుభవిస్తోంది నటి పూనమ్ కౌర్. మాయ జాలం, ఒక విచిత్రం, వినాయకుడు, గగనం వంటి చిత్రాల్లో నటించిన ఈ భామ ప్రస్తుతం బాహుబలి నిర్మాతల్లో ఒకరైన దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్న స్వర్ణఖడ్గం సీరియల్లో నటిస్తోంది. వి. సత్యనారాయణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సీరియల్ లో పూనమ్ కౌర్ ఒక రాజ్యానికి రాణిగా అలరిస్తోంది. ఆమె కొంతకాలం క్రితం ప్రముఖ సినీ డైరక్టర్ పై, హీరోపై సంచలన వ్యాఖ్యలు చేసింది. వారి అభిమానులను హర్ట్ చేసింది. అప్పుడు సైలంట్ గా ఉన్న ఫ్యాన్స్ తాజాగా రియాక్ట్ అయ్యారు.

కృష్ణాష్ట‌మి సంద‌ర్భంగా ఓ మంచి వీడియోను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు అంత‌కుముందు రోజు పూనమ్ ట్విట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. ఆ వీడియోను ఎంతో నిజాయితీగా, సంతోషంతో రూపొందించాన‌ని తెలియ‌జేస్తూ దానికి “పీకే ల‌వ్‌” అనే హ్యాష్‌ట్యాగ్‌ను జ‌త‌చేసింది. అయితే ఊహించ‌ని విధంగా పూన‌మ్‌కు నెటిజ‌న్ల నుంచి వ్య‌తిరేక‌త ఎదురైంది. నెటిజ‌న్ల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు రావ‌డంతో ఆవేద‌న చెందిన పూన‌మ్ ఆ వీడియో విడుద‌ల‌ను ఆపేసింది. “నేను ఎంత క‌ష్ట‌ప‌డి, నిజాయితీగా ప‌నిచేశాను అనేది ఇక్క‌డ ఎవ‌రికీ అవ‌స‌రం లేదు. నా త‌ప్పు లేక‌పోయినా న‌న్ను విమ‌ర్శిస్తున్నారు. అందువ‌ల్ల‌ నేను ఎంతో ఇష్ట‌ప‌డిన ఈ వీడియోను విడుద‌ల చేయాల‌నుకోవ‌డం లేదు” అంటూ పూన‌మ్ ట్వీట్ చేసింది. ఒక మాట అనేముందు ఆలోచించుకోవాలని పెద్దలు ఊరికే చెప్పలేదని ఈ సంఘటన ద్వారా పూనమ్ కి బాగా అర్థమయి ఉంటుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus