‘శ్రీనివాస కళ్యాణం’లో పూనమ్ కౌర్ నటించడంపై సందేహాలు!

  • August 1, 2018 / 08:03 AM IST

మాయ జాలం, ఒక విచిత్రం, వినాయకుడు, గగనం వంటి చిత్రాల్లో నటించిన పూనమ్ కౌర్ కి మంచి బ్రేక్ రాలేదు. దీంతో పోటీని తట్టుకోలేక వెండితెర నుంచి పక్కకు తప్పుకుంది. ప్రస్తుతం బాహుబలి నిర్మాతల్లో ఒకరైన దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్న స్వర్ణఖడ్గం సీరియల్లో నటించింది. వి. సత్యనారాయణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సీరియల్ లో పూనమ్ కౌర్ ఒక రాజ్యానికి రాణిగా అలరిస్తోంది. ఆమె కొంతకాలం క్రితం ప్రముఖ సినీ డైరక్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. “ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో ఉన్న ఓ డైరెక్ట‌ర్ సినిమాల‌ను మాత్ర‌మే కాకుండా మ‌నుషుల్ని కూడా డైరెక్ట్ చేస్తుంటాడు. న‌న్ను కూడా డైరెక్ట్ చేయాల‌ని చూశాడు. న‌న్ను మాయ చేయాల‌ని చూశాడు. దాని గురించి నేను గ‌ట్టిగా అడిగే స‌రికి ఏమీ జ‌ర‌గ‌న‌ట్టు న‌టించాడు.” అని ఆరోపణలు చేసింది.

అలాగే కత్తి మహేష్ పూనమ్ కౌర్ తో పవన్ కి లింక్ పెట్టడంతో వార్తల్లో నిలిచింది. పవన్ రికమండేషన్ వల్లే ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతోందన్న విమర్శలను ఎదుర్కొంది. అప్పటి నుంచి పేరు చెప్పకుండా పవన్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించింది. ఆ డైరక్టర్, పవన్ కి నితిన్ వీరాభిమాని. అయినప్పటికీ అతని తాజా చిత్రం శ్రీనివాస్ కల్యాణంలో కనిపించడంతో అందరూ అవాక్ అయ్యారు. ఆమెకు ఎలా ఛాన్స్ ఇచ్చారని ప్రశ్నించుకుంటున్నారు. ఆ ఛాన్స్ రావడం వెనుక పవన్ హస్తం ఉందని, అతని చెప్పడం వల్లే నితిన్ పూనమ్ కి మంచి రోల్ ఇచ్చినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. మరి ఈ విషయంలో ఎంతవరకు వాస్తవం ఉందో పూనమ్ కౌర్ మాత్రమే చెప్పగలుగుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus