Pawan Kalyan: అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న అనా కొణిదెల.!

  • July 20, 2024 / 09:00 PM IST

టాలీవుడ్ పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఆయన సతీమణి అనా కొణిదెల సింగపూర్ యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీ పొందారని తెలుస్తుంది. ఇది ఆమెకు రెండో మాస్టర్స్ డిగ్రీ అని తెలుస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ లో నిర్వహించిన స్నాతకోత్సవంలో అనా రెండో గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నట్టు తెలుస్తుంది. ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ లో అనా మాస్టర్స్ చేశారట.

భార్య అందుకున్న పురస్కారానికి గాను హర్షం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ ఈ వేడుకలో పాల్గొన్నట్లు తెలుస్తుంది. అనా కొణిదెల రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్శిటీలో చదువుకున్నారు. అక్కడ ఓరియంటల్ స్టడీస్, ఆసియా దేశాల చరిత్ర, భాషలు, జీవన విధానంపై ఆమె పట్టా పొందడం జరిగింది. ఇక సింగపూర్లోని ఈ వేడుకలో పాల్గొనడానికే పవన్ కళ్యాణ్ ఇటీవల తన భార్యతో కలిసి అక్కడికి వెళ్లారు. ఎయిర్ పోర్ట్ లో అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.

పవన్ కళ్యాణ్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. సినిమాల జోలికి పోవడం లేదు. కొంచెం టైం దొరికితే ‘ఓజీ’ చిత్రాన్ని కంప్లీట్ చేయాలని పవన్ భావిస్తున్నారు. రీ ఎంట్రీలో పవన్ చేస్తున్న స్ట్రైట్ మూవీ కాబట్టి, దీని పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus