ఆ టైంలో బాలీవుడ్ అనగానే ప్రభాస్ కు తెగ టెన్షన్ వచ్చిందట..!

  • January 2, 2021 / 05:48 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాస్తా… ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గా ఎదిగాడు. రాజమౌళి తో చేసిన బాహుబలి వల్లే ఆ ఫీట్ సాధ్యమయ్యింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం ప్రభాస్ కు నార్త్ లో మంచి మార్కెట్ ఉంది. సాహో చిత్రం నెగిటివ్ టాక్ తో కూడా అక్కడ 125కోట్ల షేర్ ను రాబట్టింది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ అలాగే ఆదిపురుష్ చిత్రాలకు అక్కడ భీభత్సమైన హైప్ ఏర్పడింది.

వాటి మార్కెట్ అక్కడ 400కోట్ల వరకూ ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అక్కడి నిర్మాతలు కూడా ప్రభాస్ తో భారీ బడ్జెట్ తో సినిమాలు నిర్మించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఇంత స్టార్ డంను అనుభవిస్తున్న ప్రభాస్.. గతంలో బాలీవుడ్ అంటే చాలా భయపడేవాడట. ఇదే విషయాన్ని ప్రభాస్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ‘బిల్లా’ ‘ఏక్ నిరంజన్’ సినిమాల టైంలో ప్రభాస్ ను.. బాలీవుడ్ ఎంట్రీ గురించి ప్రశ్నించగా…

అతను చెప్పిన రిప్లై కు అంతా ఆశ్చర్యపోయారని అతను తెలిపాడు. ‘అసలు ఇక్కడే ఇంకా ఏమీ సాధించలేదు.. బాలీవుడ్ వెళ్తే ఏం సాధిస్తాను’ అంటూ ప్రభాస్ ఆ టైములో సమాధానం చెప్పాడట. అంతేకాదు బాలీవుడ్ ఎంట్రీ అంటేనే చాలా టెన్షన్ వచ్చేదని ప్రభాస్ తెలపడం గమనార్హం. అంత భయపడిన ప్రభాస్.. ఇప్పుడు అక్కడి స్టార్ హీరోలతోనే సమానంగా రాణిస్తుండడం ఆశ్చర్యం కలిగించే విషయమని చెప్పొచ్చు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus