ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కు నిజంగా కిక్కిచ్చే న్యూసే..!

  • July 13, 2019 / 05:49 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సాహో’. సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్నారు. సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇది పక్కన పెడితే ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్లో పెరిగింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇండియా వైడ్ ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పటి వరకూ మనం ఇక్కడ వరకూ అనుకున్నాం. కానీ ఇప్పుడు అది దేశాలు కూడా దాటెల్లిపోయిందనిది తాజా సమాచారం.

అసలు విషయం ఏంటంటే.. ఇటీవల ‘సాహో’ చిత్రం నుండీ ‘సైకో సియాన్’ అనే పాట విడుదలయ్యింది. ఈ పాట తెలుగు ప్రేక్షకులు కాస్త లేట్ గా రిసీవ్ చేసుకున్నప్పటికీ.. హిందీ ప్రేక్షకులకి మాత్రం ఈ పాట తెగ నచ్చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ నటి “మవ్రా హొకెన్” తన ట్విట్టర్ ద్వారా ప్రభాస్ పేరు పెట్టి ట్వీట్ చేసింది. అంతే కాదు ‘లవ్’ ఈమోజీస్ కూడా పెట్టింది. దీనిని బట్టి చూస్తే.. ప్రభాస్ క్రేజ్ పాకిస్థాన్ వరకూ పాకిందని స్పష్టమవుతుంది. ఈ విషయం పై ప్రభాస్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇక ‘సాహో’ చిత్రం ఆగష్టు 15 న విడుదల కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus