బాహుబలిపై ప్రభాస్ ఎమోషనల్ పోస్ట్

  • July 12, 2017 / 09:34 AM IST

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన కళాఖండం బాహుబలి ది బిగినింగ్ 2015 జులై 10 న థియేటర్లోకి వచ్చింది. అనేక రివార్డులు, అవార్డులు కొల్లగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా 650 కోట్లు గ్రాస్ వసూలు చేసి ఔరా అనిపించింది. ఈ మూవీ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా  చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ  “బాహుబలికి రెండేళ్లు నిండాయి. మా కెరీర్లో పెద్ద పరీక్షను పాసైన క్షణం ఎప్పటికీ మరచిపోలేము.” అంటూ పోస్ట్ చేశారు. ప్రభాస్ మాత్రం చాలా ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియాలో తన ఫీలింగ్ ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. ‘‘నాకెంతో ప్రత్యేకమైన సినిమా ‘బాహుబలి ది బిగినింగ్’ విడుదలై రెండేళ్లు పూర్తయింది. కానీ సినిమాకు సంబంధించిన జ్ఞాపకాలు ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి.

చిత్ర యూనిట్ మొత్తం ఒక తపనతో పడిన కష్టం నా జ్ఞాపకాల తెరముందు స్పష్టంగా కనిపిస్తోంది. నా కెరీర్‌ను మహోన్నతమైన స్థాయికి తీసుకెళ్లిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదని భావిస్తున్నా. ‘బాహుబలి’ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా మనందరినీ వెనకుండి నడిపించిన రాజమౌళికి మనం రుణపడి ఉంటాం.’’ అని ప్రభాస్ చేసిన పోస్ట్ అందరిని ఆకట్టుకుంటోంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus