దేశ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్న ప్రభాస్

  • August 24, 2017 / 06:07 AM IST

బాహుబలి సినిమాతోనే ప్రభాస్ దేశ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. కొత్తగా ఇప్పుడు వార్త రాయడం ఏమిటి అనుకుంటున్నారా ?.. తాజాగా ఇండియా టుడే నిర్వ‌హించిన సర్వేలో ఈ విషయం మళ్ళీ స్పష్టమయింది. “మూడ్ ఆఫ్ ద నేష‌న్ 2016-17 ” స‌ర్వేలో తొలిసారిగా టాలీవుడ్ హీరోకి చోటు దక్కడం విశేషం. “మూడ్ ఆఫ్ ద నేష‌న్ 2016-17 ” సర్వే ఓటింగ్ లో 11 శాతం ఓట్ల‌తో అమితాబ్ బ‌చ్చ‌న్‌, స‌ల్మాన్ ఖాన్‌లు  మొద‌టి, రెండో స్థానంలో నిలవగా, 9 శాతం ఓట్లతో షారుక్ ఖాన్‌కు మూడో స్థానం, 8 శాతం ఓట్ల‌తో అక్ష‌య్‌ కుమార్‌కు నాలుగో స్థానం లభించింది. ప్ర‌భాస్ 7 శాతం ఓట్ల‌తో పాపులర్ నటుల జాబితాలో ఐదో స్థానంలో నిలిచారు.

ఇక కథానాయికల జాబితాలో 9 శాతం ఓట్లతో ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే తొలి రెండు స్థానాల్లోనూ, 8 శాతం ఓట్లతో ఐశ్వ‌ర్య‌రాయ్‌, అనుష్క శ‌ర్మ‌ తర్వాత స్థానంలోనూ, 7 శాతం ఓట్లతో క‌త్రినా కైఫ్‌ ఐదో స్థానంలో నిలిచారు. ఇక సినిమాల విషయానికి వస్తే అత్యుత్తమ ప్రజాదరణ పొందిన చిత్రాల జాబితాలో 26 శాతం ఓట్లతో బాహుబలి తొలి స్థానంలో నిలిచింది. బాలీవుడ్ ఎవ‌ర్‌గ్రీన్ చిత్రం `షోలే` రెండో స్థానంలోనూ, బాహుబ‌లి వన్ మూడు, దంగ‌ల్‌ నాలుగో స్థానంలోనూ నిలిచాయి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus